GURU POOJA

*Rashtriya Swayamsevak Sangh - Secunderabad Bagh*🚩🚩
*राष्ट्रीय स्वयंसेवक संघ - सिकंदराबाद भाग*

⛳ *Shri Gurupooja Utsav Invitation*⛳
*गुरु पूजा उत्सव*

♦️♦️♦️♦️♦️♦️♦️♦️
*Shri Gurupooja Utsava is one among the six Utsavas celebrated in Sangh. Sangh has kept before itself neither an individual nor a book as its Guru (authority), but Bhagava Dhwaja -the glowing symbol of all that is good in our national life and through that it is striving for inculcating the pure devotion to the nation as a whole. We celebrate the utsava by performing pooja and samrpana to Bhagava Dhwaja.*

*Shri Gurupooja Utsav Details*

*Date & Time :*


*Venue :* *

*Location :* 

*Speaker :*

You are cordially invited

Bavadiya


*Note:* 
Please be seated 10 minutes before start of the programme.

*శ్రీ గురుపూజా ఆహ్వానము*🚩

*అతి ప్రాచీన కాలం నుండి మన ధార్మిక ఆధ్యాత్మిక సాంస్కృతిక జీవనానికి ప్రతీకగా ఉన్న పరమపునీత కాషాయధ్వజాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ గురువుగా స్వీకరించింది. త్యాగము, సేవ, సమర్పణ, మొదలగు సుగుణాలను కలిగింపజేసే గురుపూజా మహోత్సవమునకు తమరిని తప్పక విచ్చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాము.*

*కార్యక్రమ వివరాలు :*

*తేది:* 
*సమయము :* 
*స్థలం:* 

*వక్త :* శ్రీ 

*భవదీయ*


*సూచనలు :*
♦️కార్యక్రమము ప్రారంభమునకు 10ని॥లు ముందుగా రాగలరు. 
♦️ఉత్సవస్థలంలో జాతీయ సాహిత్యము విక్రయించబడును.

मान्यवर
सनातन काल से ही परम पवित्र भगवाध्वज हिंदू संस्कृति का आदर्श एवं प्रेरणास्त्रोत रहा है। भगवाध्वज हमारा गुरु व मार्गदर्शक है।
गुरु पूर्णिमा के अवसर पर हम प्रतिवर्ष गुरू पूजन सहित गुरुदक्षिणा अर्पण करते है।

अपने क्षेत्र का गुरू पूर्णिमा उत्सव दिनांक ____ जून _____, रविवार  को निम्न सूचनानुसार आयोजित होगा। आपकी उपस्थिति सादर अपेक्षित है।

*Venue :* 

*Location :* 

*Speaker :*
 

*भवदीय*
_____&&&&____________BOUDIK____________


ఓం హిందూ ప్రకాశన్ చింతన్‌

బౌద్దిక్ - 3 మన గురువు భగవద్ధ్వజం
July 05, 2020


                       బౌద్ధిక్ -1.                      
#మన #గురువు #భగవాద్‌ధ్వజం  
🚩🚩🚩
*అమృత వచనము*

*దేనిని చూస్తే మనకు ప్రేరణ, స్ఫూర్తి లభిస్తాయో, ఆదర్శం, జీవన లక్ష్యం యొక్క జ్ఞానం కలుగుతుందో, శ్రేష్ఠమూల్యాలను రక్షించడానికి పోరాడేటపుడు తమ వ్యక్తిగత జీవితాలను సమర్పిస్తూ సంతోషం పొందగలుగుతారో వాటన్నింటికి ప్రతీకయే ఈ భగవాధ్వజం..*

*- పండిత దీనదయాళ్ ఉపాధ్యాయ* 

శ్రీ గురుపూర్ణిమ అనీ, వ్యాస పూర్ణిమ అనీ వ్యవహరించే ఈరోజు మనకు ఎంతో ప్రముఖ పవిత్ర పర్వం. అనంత విజ్ఞాననిధులైన వేదాలను విభజించి, సువ్యవస్థితం చేసి మనకు అందించినవారు మహామహులైన వ్యాసమహర్షియే. 

అష్టాదశపురాణేషు వ్యాసస్య వచనం ధృవం|
పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం||

యుగయుగాలుగా భరత వర్షంలో వికసించిన ఉత్తమమైన సద్గుణ సంపత్తిని ప్రపంచానికి ప్రకటించినదానిలో అంతర్లీనమై యున్న ఆలోచనకు, ఆదరణకు నడుమగల మనోహర సమన్వయాన్ని ఆయన మనకు అందించారు. ఆయన కృషి మనకు మాత్రమేగాక మానవ జాతి కంతకు కూడ మార్గదర్శనం చేసే దీపస్తంభం లాంటిది. కాబట్టి వేదవ్యాసుని జగద్గురువు అంటే ప్రపంచ ప్రబోధకుడని చెప్పటం సముచితం. ఇందుచేతనే గురుపూజని, వ్యాసపూజ అని కూడా చెప్పుకుంటున్నారు.

ఈ రోజున మనం మన గురువునకు- వారెవరైనప్పటికీ అర్చన చేసి, వారి పాదాలవద్ద ఆశీస్సులు కోరి మన వినయపూర్వక సమర్పణ చేస్తాం. వారి ఆశీస్సులను కోరి, వారి మార్గదర్శకత్వపు వెలుగుల్లో మన జీవన లక్ష్యసాధనా మార్గంలో ముందడుగు వేసేందుకు దృఢనిశ్చయం చేసుకుంటాం.

సాధనా మార్గంలో ముందడుగు వేసేందుకు దృఢ నిశ్చయం చేసుకుంటాం....

#రాష్ట్రీయ #స్వయంసేవక్ #సంఘ్ #కార్యపద్ధతికి సంబంధించినంతవరకూ సంఘం ఏ ఒక్క వ్యక్తిని గురువుగా భావించలేదు.
వ్యక్తి ఆరాధన కంటే ధ్యేయ నిష్ఠయే సంఘ కార్య పద్ధతికి మూలం..
మన శాస్త్రాలు గురువు యొక్క లక్షణాలను ఉజ్వల పదజాలంతో ప్రశంసించాయి.గురువులకు సాక్షాత్తు దైవం తో సమానం అయిన స్థానాన్ని ఇచ్చాయి. అట్టి గురువును ఒక మానవునిలో చూడగలగడం దాదాపు అసంభవమే. ఏ మానవుడైనా ఏదో ఒక దోషం గానీ ,లోపం గానీ లేకుండా పరిపూర్ణుడిగా ఉంటాడని మనం ఊహించలేము. మానవునిది అశాశ్వతమైన అస్తిత్వమే. అతడు తరతరాలకు ఒక జాతికంతకు శాశ్వతమైన మార్గదర్శకుడు కాలేడు.

అందుచేతనే సంఘంలో మనం మన జాతీయ వారసత్వం లోని మహోన్నతమైన మహోదాత్తమైన ఉమ్మడిగా ప్రతిబింబించేలా ఒక ప్రతీకను గురువుగా స్వీకరించాము అదే మన పవిత్ర మైన భగవాన ధ్వజం...🚩🚩

#యజ్ఞభావనకు #ప్రతీక #భగవత్ ధ్వజం

యజ్ఞము అంటే త్యాగం భావన - మన సాంస్కృతిక వారసత్వం లో కీలకమైన స్థానం కలిగి ఉంది. యజ్ఞం పదానికి అనేక అర్థాలున్నాయి.

సమాజ పునరుజ్జీవన కార్యంలో తన వ్యక్తిగత జీవితాన్ని సమర్పణ చేయటమే యజ్ఞం. 
సద్గుణాలనే అగ్నిజ్వాలల్లో, మనలోని అయోగ్యమూ అవాంఛనీయమూ, అపవిత్రం ఐనవన్నీ ఆహుతులుగా సమర్పించడం గూడా యజ్ఞమే. 

అలాగే జ్వాజ్వల్యమానమైన భక్తి, సమర్పణ, సేవ తపస్సు మార్గానికంకితం కావటమే యజ్ఞం యొక్క పరమ తత్వం..

యజ్ఞానికి అధిదేవత అగ్ని. అగ్నిజ్వాలలు అగ్నికి ప్రతీకలు. పవిత్ర మైన భగవాధ్వజం- అరుణారుణ కాంతుల యజ్ఞజ్వాలలకు ప్రతీక...

#భగవాధ్వజం

👉మనం శ్రద్ధ భావనను ఆరాధించేవారమేగాని- మౌఢ్యాన్ని కాదు..
👉మనం విజ్ఞానపు భక్తులమేగాని అజ్ఞానానికి కాదు..
👉మన మునులు, ఋషులు అజ్ఞానాన్ని తొలగించుకొని సత్యము, చిరంతనమూనైన విజ్ఞాన సముపార్జనకై తీవ్రమైన తపస్సు చేసారు. 
చీకటి అజ్ఞానానికి గుర్తు.సూర్యుడు జ్ఞాన జ్యోతికి గుర్తు. మన ప్రాచీన సాహిత్యంలో సూర్యుడు, సూర్యనారాయణుడు ఏడు గుర్రాలు లాగే రథం మీద కూర్చుండినట్లు వర్ణింపబడింది. ఆయన ఉదయించటానికి ముందే- ఆయన రథంపై ఎగురుతున్న కాషాయ ధ్వజం తూర్పు దిక్కున రంగుల కాంతులు విరజిమ్ముతూ కనిపిస్తుంది. చీకటిని చీల్చుకుంటూ, ఉదయకాంతుల ఆగమనాన్ని ప్రకటిస్తూ సూర్యోదయ సమయంలో తూర్పు దిక్కు విరజిమ్మే అరుణకాంతులకది ప్రతీక. సూర్య భగవానుని ఆ ధ్వజమే భగవానుని ధ్వజం.....🚩🚩🚩 భగవాధ్వజం అయింది.

మానవ జీవన వికాసంలోని అత్యున్నత స్థాయి- 
బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస 
వీటిలో
నాలుగవది చివరదీ అయిన ఆశ్రమంలో అంటే- పరిపూర్ణ త్యాగం, సేవ భావాలు అవసరమైన సన్యాసం ఇందు ప్రతిబింబిస్తుంది. 'సన్యాసి' ఆత్మార్పణమనే అగ్నిజ్వాలల మార్గంలో తొట్రుపాటు లేకుండా పయనించాలి.. అందుకొరకు అతనికి సదా త్యాగమయ జీవితాన్ని గుర్తు చేసేదిగానే కాషాయవస్త్రాన్ని సన్యాసి ధరిస్తారు...

ధర్మం ( ధర్మం ), సంపద (అర్థం), కోరిక (కామ) మరియు అంతిమ విముక్తి (మోక్షం) అనేవి భారతీయ (భారతీయ) సంస్కృతి ప్రకారం మానవ జీవితంలోని నాలుగు సాధనలు (పురుషార్థం). వైదిక మతంలో వివరించబడిన 'జీవిత దశ' (ఆశ్రమాలు) వ్యవస్థ వాటిని సాధించడానికి ప్రధాన సాధనం. జీవితంలోని వివిధ దశలలో చేయవలసిన విధులను వివరించేటప్పుడు, మనిషి యొక్క జీవితకాలం 100 సంవత్సరాలుగా పరిగణించబడుతుంది మరియు నాలుగు భాగాలుగా విభజించబడింది. ప్రతి ప్రదర్శన ఒక వేదిక ( ఆశ్రమం ) అంటారు .

#నిజమైన #గురు #ఆరాధన

గురువు ఆరాధించే టప్పుడు మనం ఎట్టి మన స్థితిని పెంపొందించుకోవాలి...???

పూలు, గంధం సమర్పించటం, హారతులీయటం, కేవలం బాహ్యాచారాలు మాత్రమే. గురువులో రూపుకట్టిన సద్గుణాలను మన జీవితంలో అలవరచుకునేందుకు ప్రయత్నించటంలోనే నిజమైన పూజా సాఫల్యం వున్నది. కాబట్టి, సాక్షాత్తు గురువుతో మరింత తాదాత్మ్యం చెందటం నిజమైన ఆరాధన. 

"పుష్పమాలలు పత్రదళములు పుణ్య జల అభిషేక కర్మలు....
చందనము కర్పూర హారతి తృప్తినీయవు మాతృమూర్తికి....
సింహ విక్రములై చెరించేడు లక్షలాదిగా శ్రేష్ఠ వ్యక్తుల....
కర్మమయ జీవనము నెగిసేడు తపోజ్వాలలు హారతియగా....."

శివుడవై శివుని పూజించుకోవాలి
"శివో భూత్వా శివం యజేత్" అని ప్రకటించే ప్రాచీన ప్రబోధం ఒకటుంది..
కేవలం ధనసంపాదనను మాత్రమేగాక మన సంపూర్ణ భద్రత, సౌఖ్యములు కూడా సమాజమే మనకు సమకూరుస్తోంది. ఆ విధంగా సమాజ రుణాన్ని, మనకు వీలైనంత అధికంగా తీర్చుకోవటం మన విధి. 

నిజానికి సమాజ ఋణాన్ని తీర్చుకునేందుకు మన శరీరాన్ని, మనస్సునూ, బుద్ధిని సమర్పిస్తూ మనలో సంవేదన శీలత నిర్మాణం చేసేది రోజూకొక గంట సమయం మనం వెచ్చించే దైనందిన శాఖ కార్యక్రమం...
శాఖలో స్వయం సేవకులు అందరూ నిత్యం భగవత్ ధ్వజ ఛాయలో శిక్షణ పొందుతూ సర్వస్వాన్ని దేశహితం కొరకు సమర్పించే విధంగా నిర్మాణం అవుతారు.
#భారత్ #మాతాకీ #జై
 
                          బౌద్ధిక్ -2

#త్యాగ #భావనే #హిందుత్వం....

దుర్లభం త్రయమేవాత్ర 
దైవానుగ్రహ హేతవః
మనుష్యత్వం ముముక్షుత్వం 
మహాపురుష సంశ్రయః

సృష్టిలో అత్యంత దుర్లభమైనవి మూడు విషయాలు – అవి 
#మానవజన్మ, 
#మోక్షప్రాప్తి, 
#మహాపురుషులసాంగత్యం.  
– ఆదిశంకరాచార్య

మానవ జన్మ సర్వశ్రేష్ఠమైనది. ఆత్మ 84 జీవరాశుల గుండా ప్రయాణించి ఎప్పుడో ఒకప్పుడు మానవ శరీరంలో చేరుతుంది. బుద్ధిజీవి అయిన మానవుడు ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. సుఖ శాంతులతో జీవించాలి. అందుకే ఈ ప్రపంచంలోని మేధావులు మానవ సంక్షేమం కోసం అనేక రకాలుగా శోధించారు. అందులో నుండే వివిధ మతాలు, సిద్ధాంతాలు, తత్వాలు, సంపద్రాయాలు పుట్టు కొచ్చాయి.

#ధర్మమే #శాశ్వతం

ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద సిద్ధాంతాలైన #కమ్యూనిజం, #క్యాపిటలిజం కూడా సుఖశాంతుల కోసం వ్యక్తి స్వేచ్ఛను, భౌతికవాదాన్ని గురించి చెప్పాయి. అయితే అవి విఫలం అయ్యాయి. జీవితానికి సంపదలు, సుఖశాంతులే కాదు, అరుదైన ఈ మానవజన్మకు సార్థకత కావాలి. మానవ జన్మ అరుదైనది కనుక అన్ని సుఖాలు ఈ జన్మలోనే పొందాలని పాశ్చాత్యులు అనుకుంటారు. 
కానీ మనం...'

"చలం చిత్తం చలం విత్తం చలే జీవన యౌవనే
చలా చలే హి సంసారే ధర్మ ఏకో హి నిశ్చలః"

చిత్తం (మనస్సు), విత్తం (ధనం), యవ్వనం, జీవితం చివరికి ప్రపంచం కూడ శాశ్వతం కాదు. ధర్మం మాత్రమే శాశ్వతం అని భావించాము. 

అందుకే సంపన్నులను, ధనవంతులను గొప్పవారిగా మనం భావించలేదు. ధనం శాశ్వతం కూడా కాదు. 
ఉదా:1
అందుకే అలెగ్జాండర్‌ ‘తాను మరణించాక, తన శవపేటికకు రెండు రంధ్రాలు చేసి తన ఖాళీ చేతులు బైటికి కనపడే విధంగా ప్రపంచానికి చూపండి’ అన్నాడు’. ‘అంతపెద్ద రాజు అయుండి కూడా మరణించాక ఖాళీ చేతులతోనే వెళుతున్నాడు కానీ, ఒక్క పైసా కూడా పట్టుకుపోవడంలేదు’ అని దానర్థం.

ఉదా:2
యయాతి అనే రాజు విలాస జీవితం కోసం తన కుమారుని యవ్వనాన్ని కూడా అడిగి తీసుకున్నాడు. కానీ చివరికి ఆనందం పొందలేక పోయాడు. కనుక యవ్వనం కూడా శాశ్వతం కాదు.
జీవితం కూడా బుద్బుధ ప్రాయం. ‘రేపు’ అనేది ఎలా ఉంటుందో తెలియదు. 

ఉదా:3

ధర్మరాజు జీవితంలోని ఒక సంఘటన మనకు అదే చెబుతుంది. తన దగ్గరకు వచ్చిన భిక్షకునికి దానం ఇవ్వడానికి మరుసటి రోజు రమ్మని ధర్మరాజు చెప్పాడు. అది విని భీముడు ఆశ్చర్యపోతాడు. ‘అన్నా ! రేపటి వరకు నీవు మృత్యువును జయించావా?’ అని అడగడంలోని అంతరార్థాన్ని మనం అర్థం చేసుకోవాలి.

#త్యాగానికి #ప్రతీక

అందుకే భారతీయులు భోగమయ జీవనం కోరలేదు. త్యాగమయ జీవనాన్ని స్వీకరించారు. ప్రతి సమాజానికి తనదంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. 
"ఆంగ్లేయులు క్రమశిక్షణకు, జర్మన్లు యుద్ధ నిపుణతకు ప్రతీకలు. మన భారతీయులు త్యాగం, సమర్పణ భావాలకు ప్రతీకలు. మన జీవన తత్త్వంలోనే త్యాగం, సమర్పణ సహజంగా కనిపిస్తుంటాయి."

న ప్రజేయా న కర్మణా న ధనేన
త్యాగేనైక అమృతత్వ మానశుః
అనేది ఉపనిషత్తు వాక్యం. 
జీవితం అమృతమయం కావడమంటే, త్యాగ మయం కావడం తప్ప మరేది కాదు.

మన జీవన పరంపర యజ్ఞభావనతో ముడిపడి ఉంది. యజ్ఞం అంటే సమర్పణ. సమ-అర్పణ. ఇతరులకు అర్పించడం. యజ్ఞం అదే నేర్పిస్తుంది. సమిధలన్నింటిని అగ్ని దేవునికి ఆహుతి ఇస్తూ ‘ఇదం న మమ. ఇదం స్వాహా’ ‘ఇది నాది కాదు, ఇది నీకు అర్పిస్తున్నాను) అంటుంటారు.
‘తేన త్యక్తేన భుంజీతాః’ అనేది మన ఉపనిషత్తులలో చెప్పిన మరొక విషయం. 

ఈశావాస్యమిదం సర్వం, యత్కించ జగత్యాం జగత్|
తేన త్యక్తేన భుంజీథాః, మా గృధ: కస్య స్విద్ధనం||

ఈ సృష్టి సమస్తం ఈశ్వరత్వం వ్యాపించి ఉన్నది. నాదంటూ ఏమీ లేదు. నాకు అవసరమైనంత మేరకు మాత్రమే నేను అనుభవిస్తాను. అది కూడా త్యాగమయ భావనతోనే. అంతకన్నా ఎక్కువగా స్వీకరించడం తగదు. ఈ త్యాగం, సమర్పణ అనేవి అత్యుత్తమ సంస్కారాలు. 

హైందవ జీవనంలో అతి సహజంగా ఇవి అలవడేలా వ్యవస్థ రూపుదిద్దుకుంది.
మన దేశంలో అత్యంత విశేషమైనది కుటుంబ వ్యవస్థ. కుటుంబంలో ఒకరి కోసం ఒకరు జీవిస్తారు. ప్రతి ఒక్కరు ఇంకొకరి సంక్షేమం ఆకాంక్షిస్తారు. తమకు లేకున్నా కుటుంబంలోని ఇతరులు సుఖంగా ఉండాలని కోరుకుంటారు. ”నా ఇల్లు’ నుండి ప్రారంభించి నా బస్తి, నా గ్రామం, నా దేశం, ఈ ప్రపంచం’ అంతా ఒక్కటనే భావన వికసించాలనేది మన ఆకాంక్ష. అందుకే ‘ఈ భూమి అంతా ఒక్కటే కుటుంబం (వసుధైక కుటుంబం)’ అని ధ్యేయవాక్యంగా ఉపయోగిస్తాం.

👉ధర్మరక్షణార్థం తన వెన్నెముకను ధారపోసాడు ధధీచి. 
👉ఒక పక్షి కోసం తన శరీరం మొత్తం అర్పించాడు శిబి చక్రవర్తి. 
👉ప్రాణుల బాధలు తొలగించడానికి సర్వస్వార్పణ చేసాడు మహారాజు రంతిదేవుడు. 

నత్వహం కామయే రాజ్యం.
న స్వర్గం, నా పునర్భవం.
కామయే దుఃఖ తప్తానాం
ప్రాణినా మార్తి నాశనం.
క:-కోరను రాజ్య సుఖంబును.
కోరను స్వర్గంబు నిజము. కోరను ముక్తిన్.
కోరెద దుఃఖార్తుల దరి
చేరి, తపన బాపి, రక్ష సేయుండనుచున్.
భావము:-భారతీయుడు తన హృదయములో ఇలా అనుకొంటున్నాడు. నేను రాజ్య సంపద కోరను. స్వర్గము ప్రాప్తింప జేయమని కోరను. జన్మ రాహిత్యము వాంఛింపను. సంసార దుఃఖ సంతప్తులైయున్నవారికడనుండి వారి ఆర్తిని బాపి, వారి దుఃఖమును పోగొట్టమని మాత్రము కోరుదును.

👉తనదంతా సమర్పించడానికి సర్వదక్షిణ యాగం చేశాడు రఘుమహారాజు. 
👉స్వధర్మ సంరక్షణకు రాజభోగాలను వదిలి అడవులపాలై కష్టాలను సహించాడు మహారాణాప్రతాప్‌. 
👉సమస్త రాజ్యానికి తాను కేవలం ప్రతినిధిని అని, తన గురువైన సమర్థ రామదాసు రాజు అని ప్రకటించిన ఛత్రపతి శివాజీ, 
👉ఐసిఎస్‌ చదువును స్వతంత్ర సమరం కోసం తృణప్రాయంగా త్యజించిన నేతాజీ, 
👉యౌవ్వనాన్ని వందేళ్ళ జీవితంగా భావించి తనను తానుగా అర్పించుకొన్న భగత్‌సింగ్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌, మదన్‌లాల్‌ ధీంగ్రా, ఖుదిరాంబోసు; 
👉అతి పేదరికంలో వైద్య విద్యను చదివి, తన గురించి ఆలోచించకుండా జీవితాన్ని గంధపు చెక్కలా అరగదీసిన యుగద్రష్ట డాక్టర్‌ హెడ్గేవార్‌.. ఇలా రాస్తూ పోతే మనదేశంలో ఇటువంటి త్యాగధనుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది.

#అదే #హిందుత్వం

స్వభావరీత్యా మనుషుల్ని 4 రకాలుగా భావించవచ్చు. 
మొదటివారు రాక్షసులు. 
వీరికి అన్నీ ఉంటాయి. అవి ఇతరులకు ఉంటే సహించలేరు. ఇతరులు ఎదుగుతూంటే పీడిస్తూ ఆనందిస్తారు. 

రెండవవారు పశుప్రవృత్తి కలిగినవారు. ఈ వర్గంవారు తమకు తాము సంపాదించుకొని జీవిస్తారు. ఇతరుల దగ్గర లాక్కొని తాము బ్రతుకుతూ ఉంటారు. 

మూడవ వారు మానవులు. తాము జీవిస్తూ ఇతరులకు సహకరిస్తారు. 

నాలుగవారు నారాయణులు. తమకు ఏమీ లేకున్నా, ఎన్ని కష్టాలున్నా, ఇతరులకు మేలుచేసి, వారు సుఖంగా ఉంటే వీరు ఆనందిస్తారు.

మనుషులలో రాక్షస, పశు ప్రవృత్తులు ప్రబలకుండా, మానవత్వం వైపు నడిపించి, అక్కడి నుండి నారాయణ స్వరూపులుగా మార్చే ప్రయత్నమే హిందుత్వం.

#సమర్పణ

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘం ఈ హిందుత్వం ఆధారంగా జాతి వైభవాన్ని పునర్నిర్మాణం చేయడానికి పరిశ్రమిస్తున్నది. అందుకు వ్యక్తి వ్యక్తిని కలిసి, స్వయంసేవకులుగా తయారు చేస్తూ, వారిలో త్యాగం, సమర్పణ భావాలను పెంపొందిస్తున్నది. దానికి మార్గమే గురుదక్షిణ కార్యక్రమం.

వ్యక్తి శాఖకు రావడంతోనే త్యాగం, సమర్పణ అలవడటం ప్రారంభం అవుతుంది. 24 గంటలలో 23 గంటలు తనకు, ఒక గంట సమాజం కొరకు అనే ఈ భావన స్వయంసేవకులను ఎలాంటి త్యాగానికైనా సంసిద్ధం చేస్తుంది. అలా ఒక గంటతో ప్రారంభించి అనేక గంటలు, రోజులు, సంవత్సరాల తరబడి సమాజ సేవలో స్వయంసేవకులు మునిగి తేలుతుంటారు. నవ యువకులు విద్యాభ్యాసం పూర్తిచేసుకొని తమ జీవితంలో అత్యంత విలువైన సమయాన్ని కేటాయించి ప్రచారకులుగా పని చేస్తుంటారు. అలా యవ్వనంలో భవిష్యత్‌ గురించి ఆలోచించకుండా, వివాహం, కుటుంబం వంటి సౌకర్యాలు లేకుండా, ఏ కీర్తినీ ఆశించకుండా, పేరు ప్రతిష్ఠలు కోరకుండా, ఎలా అంటే అలా, ఎక్కడ అంటే అక్కడ పనిచేస్తుంటారు. ఇది ఒక అద్భుతం. వెనుతిరుగకుండా సంపూర్ణ జీవితం సమర్పించేవారు కూడా ఉన్నారు. 
👉సమాజంలో అన్నింటి మధ్య జీవిస్తూ, సన్యాస జీవితం గడపడంకన్నా త్యాగం ఏముంటుంది ?
👉అలాగే అనేకమంది గృహస్థు కార్యకర్తలు తమ వృత్తి, వ్యవహారాలు చూసుకొంటూ సమాజం కోసం అధిక సమయం ఇస్తూ పని చేస్తుంటారు. ఎట్టి అవకాశాలు కోరుకోకుండా ఉన్నదాంట్లోనే సరిపెట్టుకుంటారు. 
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇరుగు పొరుగు వారు అధికంగా సంపాదిస్తూ ముందుకు పోతున్నా వారిని చూసి చలించిపోరు. కుటుంబం కోసం తగినంత సమయాన్ని కేటాయిస్తూ, గృహస్థాశ్రమాన్ని సమర్థంగా నిర్వహించుకొంటూ, సంఘ కార్యానికి ఏ మాత్రం తగ్గకుండా సమయం కేటాయించి పనిచేసే లక్షలాది కార్యకర్తలు ఉన్నారు.

‘ధనం, సంపద మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ కాలం మళ్ళీరాదు’ అనుకొంటూ స్వయంసేవకులు ధనంతోపాటు అత్యంత విలువైన సమయం కూడా సమర్పిస్తారు. సమాజం కోసం తమ ఇష్టాలను పక్కనపెట్టి, నిష్కామంగా సంపూర్ణ మనస్సుతో అన్ని పనులు చేస్తారు. దీనినే తను, మన, ధన సమర్పణ అంటాం.

#గురుదక్షిణ

గురుదక్షిణ ఉత్సవం వ్యక్తిలో ఇటువంటి ఉన్నత భావాలు నిర్మాణం చేస్తుంది. ప్రతి సంవత్సరం స్వయంసేవకులు తను, మన, ధన పూర్వకంగా సమర్పణ చేస్తూ, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎంత ముందుకెళ్ళామనేది సమీక్షించు కుంటూ ఉంటారు.
గురుదక్షిణ అనేది చందానో, సభ్యత్వమో, దానమో కాదు. అది సమర్పణ. స్వయంసేవకులు దానిని త్యాగం కన్న కర్తవ్యంగా భావిస్తారు. నిరహంకారంతో, నిస్వార్థ బుద్ధితో, నిజాయితీతో, భక్తి శ్రద్ధలతో, పరమ పవిత్ర భగవాధ్వజం ముందు మోకరిల్లి తమను తాము సమర్పించుకుంటారు. ‘పతత్వేష కాయో’ అంటూ చిట్టచివరి శ్వాస వరకు ఈ భాగ్యం కలగాలని కోరుకుంటూంటారు.
స్వయంసేవకులు గురుపూజలో ఇలా ఆకాంక్షిస్తారు..

"తన్‌ సమర్పిత మన్‌ సమర్పిత
ఔర్‌ యహ జీవన్‌ సమర్పిత
ఛాహతా హు దేశ్‌ కే ఔర్‌ భీ కుచ్‌ దూఁగా"
ఓ భారతమాత ! నా తనువు, మనస్సు, ధనము మరియు సంపూర్ణ జీవితం నీకే అంకితం. ఓ భగవంతుడా నాకింకా తృప్తి లేదు. ఈ దేశమాతకు ఇవ్వడానికి నాకు మరికొంత ఇవ్వు.

బౌద్ధిక్ -3

డాక్టర్ జి సంఘ కార్య పద్ధతుల గురించి తన మనసులో రకరకాల భావాలు ఉన్నప్పటికీ అవి ఏవీ కూడా తన ఇష్టానుసారం సంఘంలో ప్రవేశపెట్టలేదు కార్యకర్తల అభీష్టం మేరకే తన నిర్ణయాలను సంఘంలో ప్రవేశింప చేసేవారు
1928వ సంవత్సరంలో వ్యాస పూర్ణిమ నాడు డాక్టర్ జి కాషాయ ధ్వజాన్ని భగవత్ విధంగా సంఘానికి ఒక గురువుగా అందించారు దీని వెనుక మర్మాన్ని సంఘ కార్యకర్తలకు వ్యక్తి కంటే తత్వమే గొప్పదని చెప్పి వారిని అంగీకరించేలా చేశారు

♦️హిందూ సమాజ వికాసానికి గడిచిన 98 సంవత్సరాలుగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విశేష కృషి చేస్తుంది. హిందూ సమాజం ముఖ్యంగా నలుగురుని జంగమ దేవతలుగా ప్రభలంగా విశ్వసిస్తుంది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథిదేవోభవ...

♦️గురువు అనేవారికి హిందూ సంస్కృతిలో విశేష స్థానం ఉన్నది గురు అనగా మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే వారు..

♦️సృష్టిలో ప్రతి జీవి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంటుంది ప్రతి జీవి దానికదే విశేషతను కలిగి భిన్నత్వాన్ని కనబరుస్తుంది.
వాటి యొక్క స్వభావాన్ని గుణాలను పెంచుకోవడానికి బుద్ధి వికాసాన్ని కలిగించుకోవడానికి ప్రత్యేక శిక్షణ అంటూ వాటికి ఏమీ ఉండదు.
కానీ మనిషి అపార మేధో సంపత్తిని కలిగి ఉన్నప్పటికీ చంచలమైన మనస్తత్వం కలిగి ఉన్న కారణంగా బుద్ధి స్థిరత్వాన్ని పొందలేక పోతున్నాడు.

ఆహారం నిద్రా భయ మైథునుంచ సామాన్యమేతత్ పశుభిర్ణరాణాం
ధర్మోహి తేషా మధికో విశేషో 
ధర్మేణా హీనాః పశుభి సమానాః

ఆహారం తినడం, నిద్ర, భయం, సంతానోత్పత్తి అనేవి మనుషులకు జంతువులకున్న సమానమైన లక్షణాలు.. కానీ మనిషికున్న ప్రత్యేకత ఏమిటంటే ధర్మాచరణ.....
ఎప్పుడైతే ఈ ధర్మాన్ని మనిషి విడిచిపెడతాడో అప్పుడు మనిషి అనేవాడు జంతువు కన్నా గొప్పవాడు ఏం కాదు.... తాను జంతువుతోనే సమానం..

♦️అన్నమయ్య కోశం, ప్రాణమాయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయా కోశం అనే ఈ ఐదు పంచకోషాలు మన ఆత్మను నిత్యం చైతన్యవంతంగా ఉంచుతాయి.
ఈ నిత్య చైతన్యం కోసం నిరంతర సాధన అనేది అవసరం.

తల్లిదండ్రులు మనకు శరీరం ద్వారా ఒక రూపాన్ని ప్రసాదిస్తే అందులో ఆత్మను జ్ఞానాన్ని నింపేవాడు గురువు.

♦️మానవుడు తన బుద్ధిని స్థిరపరచుకోవాలనుకుంటే దానికి నిత్యం సాధన చేయాల్సిన అవసరం ఉంది.
ఈ విషయంలో
మనకు రామాయణంలో చక్కటి ఉదాహరణ కనబడుతుంది

రాక్షస స్త్రీ అయిన సూర్పనఖ తన రూపాన్ని మార్చుకొని రాములవారిని మోహించినప్పుడు, రాముల వారి మనసు సూర్పనాక వైపు దృష్టి సారిస్తుంది. అప్పుడు రాములవారి బుద్ధి, వారి మనస్సును నిలువరిస్తుంది.
మనస్సుని తన అదుపులో ఉంచుతుంది......
అదే సమయంలో శ్రీరాముల వారు బుద్ధితో నీకు నేను తగినవాడిని కానని నా తమ్ముడు లక్ష్మణుడే సరైనవాడని పంపుతాడు....
ఆ తర్వాత ఏం జరిగిందన్న విషయం మనందరికీ తెలిసిందే...

కానీ సూర్పనఖ తన అన్న రావణుని దగ్గరికి వెళ్ళినప్పుడు, జరిగిన విషయం చెప్పకుండా నిజాన్ని దాచి, ప్రపంచంలోనే అత్యంత సుందరి అయినా ఒక స్త్రీ నార వస్త్రాలు ధరించిన ఒక అనామకునితో ఉంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్....??? అని రావణున్ని ఉసిగొలిపింది.....

సకల శాస్త్ర పారంగతుడైన రావణుడు చెల్లెలి మాట విని, తన మనస్సును బుద్ధిని నియంత్రించుకోలేక సీతాపహరణ గావించాడు.....

ఆ తర్వాత మనందరికీ తెలిసిందే.....మిగిలింది రావణ కాష్టం మాత్రమేనని.......

కాబట్టి ఎప్పుడైనా మనసు అనేది చంచలమైనది.... అది ఎప్పుడు కోరికల ప్రవాహంలో కొట్టుకుపోతుంది.. బుద్ధి అనేది ఆ ప్రవాహాన్ని నియంత్రించకపోతే జరగబోయే అనర్థాలు తీవ్రంగా ఉంటాయని మనకు ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది.

♦️జ్ఞాన, అజ్ఞాన విచక్షణ ద్వారానే బుద్ధి, మనస్సు అను ఈ రెండు అంశాల మధ్య మనకు తారతమ్యం తెలుస్తుంది.... ఈ విషయాన్ని తెలియజేసే వారే మనకు‌ గురువు అని పిలువబడుతారు..

♦️సంత్ కబీర్ దాస్ ఒక సందర్భంలో ఇలా అంటాడు....
నీ ముందు భగవంతుడు మరియు గురువు ప్రత్యక్షమైతే ముందు నువ్వు ఎవరికి నమస్కరిస్తావు...? అంటే నేను ముందు నా గురువుకు నమస్కరిస్తాను...అంటాడు ఎందుకంటే ఆ భగవంతున్ని నాకు ప్రత్యక్షం చేపించినవారు నా గురువు కాబట్టి నేను ముందు నా గురువుకే నమస్కారం చేస్తానని అంటారు.
ఈ విధంగా గురువు యొక్క ప్రాశస్యాన్ని సంతు కబీర్దాస్ తెలిపారు..

♦️ఎవరో అనామకులు మనకు ఏదో ఒక సందర్భంలో సాయం చేస్తే మన కృతజ్ఞతలు చెప్తాము మరి మనము ఉన్న అజ్ఞానాన్ని తొలగించి బుద్ధిని ప్రసాదించి మనల్ని ఒక ప్రయోజకులుగా తీర్చిదిన్న మన గురువులకు మనం ఎంత రుణపడి ఉండాలి ఈ విషయాన్ని మనం ప్రతి ఒక్కరు ఆలోచించాలి.

♦️వేల ఏండ్లుగా గ్రీకు,హుణ,శక,కుషాన,మొగలుల వంటి విధర్మీయ, విదేశి దాడులని తిప్పుకొడుతూ హిందూ సమాజం తన అస్తిత్వాన్ని నిలుపుకుంటూ వస్తుంది.
కానీ చివరగా బ్రిటిష్ వాళ్లు వ్యాపారం కై వచ్చి మన దేశాన్ని ఆక్రమించుకున్నప్పుడు మన హిందూ సంఘర్షణ చరిత్రను అధ్యయనం చేసి హిందూ జాతి యొక్క పోరాట పటిమను మరియు సాంస్కృతిక వారసత్వ పరంపరను చూసి ఆశ్చర్యపోయారు. దీనికి మూలం ఎక్కడ ఉందని అన్వేషణ ప్రారంభించారు.

♦️ఈ దేశంలో భారతీయ విద్యా వ్యవస్థ అనేది అత్యంత పకడ్బందీగా అమలవుతుందని ఇది కేవలం వారినీ భావి జీవితంలో
నిలదొక్కుకోవడానికే గాక సాంస్కృతిక వారసత్వాన్ని ఒకతరం నుండి మరో తరానికి అందించడానికి విద్యావ్యవస్థ ఒక వారధిగా ఉంటుందని బ్రిటిష్ వాళ్ళు భావించారు.

♦️బ్రిటిష్ విద్యావేత్త లార్డ్ మెకాలే కుటిలోపాయంతో భౌతికంగా హిందువులను జయించడం సాధ్యమయ్యే పని కాదని హిందుత్వను, భారతీయతను సమూలంగా నాశనం చేయడానికి ఉన్న ఏకైక మార్గం భారతీయ విద్యా వ్యవస్థను నాశనం చేయడం 
మాత్రమే ఒకే ఒక పరిష్కారమని భావించి ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారు.

దీని కారణంగా భారతీయులు మానసికంగా ఆంగ్లేయులుగా శారీరకంగా మాత్రమే భారతీయులుగా ఉంటారని తెలిపాడు.....

♦️ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయి మనం ఇప్పుడు ఆజాదికి అమృత మహోత్సవాలు నిర్వహించుకుంటున్నప్పటికీ, ఇప్పటికీ మనలో బానిస భావాలు ఇంకా పూర్తిగా పోలేవు.

♦️మన నిత్యజీవిత వ్యవహారాల్లో, మన కుటుంబ పద్ధతుల్లో, మన వేష భాషల్లో ,మన కట్టు బట్టల్లో ఇప్పటికీ బానిసత్వమే కనబడుతుంది.

*ఉదాహరణకు..*
🚫పుట్టినరోజు వేడుకల్లో దీపాలనర్పడం...
🚫ఇతర దేశస్తుల వస్త్రధారణను గుడ్డిగా అనుకరించడం...
🚫విదేశీ భాషల పట్ల మోజు
🚫మన ప్రాచీన సాహిత్యం పట్ల చిన్నచూపు
🚫 చివరాకరుకు మన పేర్లను కూడా మరిచిపోయి విదేశాలలో కుక్కలకు పెట్టుకునే పేర్లను ఈరోజు మనం మన ఇంట్లో పిల్లలకు పెడుతున్నాము.

♦️ ఎప్పుడైతే మనలోపల భారతీయత లోపించిందో, అప్పటినుండే మనలోపల స్వాభిమానం, స్వావలంబన అనేవి చచ్చిపోయినవి.

♦️ అఖండ భారత్ గా ఒకప్పుడు వెలసిల్లిన భారతదేశం...,ఎక్కడెక్కడ అయితే ఈ దేశం యొక్క ఆత్మ అయిన హిందుత్వం కనుమరుగుతూ వచ్చిందో ఆ ప్రాంతాలన్నీ ఈరోజు అన్యాక్రాంతమై దేశద్రోహులకు ఆశ్రయ కేంద్రాలు అయ్యాయి.

మన ఇంటి రక్షణకే చుట్టూ ప్రహరీ గోడలు కట్టే మనము, ఈరోజు దేశంలో అనేక భూభాగాలు అన్యాక్రాంతమైతే మనకేం పట్టనట్లు ఉంటున్నాం ఏమి...???
మన ఇల్లు ఈ దేశంలో లేదా...??
ఈ దేశం సురక్షితంగా ఉంటేనే గా నువ్వు నేను మనము ఇక్కడ ఉండేది......

♦️ దేశం, ధర్మం సురక్షితంగా ఉండేంతవరకే మనమందరం ఇక్కడ ఉంటాము... ఇప్పుడైతే దేశ ధర్మాలకు ఆపదలస్తాయో వాటిని ఎదుర్కోవడానికి మన శక్తి సరిపోకపోతే మీరు సంపాదించిన ఆస్తులు అంతస్తులు అవన్నీ కూడా విదర్మీయుల సొంతమవుతాయి...
కావున నిత్య హిందూ చైతన్య జాగృతం అనేది అవసరం..

♦️ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ వ్యక్తిని గురువుగా ఎన్నడు భావించలేదు... సంఘము తత్వాన్ని మాత్రమే ఆరాధిస్తుంది.... ఆ తత్వాన్ని పరంపరాగత చరిత్రకు, త్యాగానికి సాక్షాధారమైనటువంటి పరమ పవిత్ర కాషాయ ధ్వజాన్ని సంఘం గురువుగా భావించింది....

♦️చైతన్యవంతమైన సమాజాన్ని ధర్మ మార్గంలో నడిపించేందుకు గురువు అవసరం.. హిందూ సమాజానికి అనాదిగా ప్రతీకగా నిలుస్తున్న ఈ కాషాయ పతాకం భగవధ్వజ్ ను గురువుగా స్మరిస్తూ మనం ప్రతి సంవత్సరం గురుపూజ నిర్వహిస్తాం.
ఈ గురు పూజ ద్వారా స్వయంసేవకులలో సమర్పణ అనే సంస్కారాన్ని పెంపొందించడం జరుగుతుంది. 

♦️ ప్రతి స్వయంసేవక్ తను మను ధన పూర్వకంగా తమ గురువు అయినటువంటి పరమ పవిత్ర భగవద్ ధ్వజానికీ సమర్పించడం జరుగుతుంది.

బౌద్ధిక్ -4
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘము భగవాధ్వజాన్ని తన గురువుగా స్వీకరించింది. గురుపూర్ణిమ సందర్భంగా దేశమంతటా గురుదక్షిణ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. అయితే సంఘం భగవాధ్వజాన్ని గురువుగా ఎందుకు స్వీకరించిందన్న ప్రశ్న ఉదయిస్తుంది.?
గురుదక్షిణ : 

సంఘము తన ప్రతి శాఖలో వ్యాసపూర్ణిమ /గురుపూర్ణిమ రోజున గురుపూజ

Popular posts from this blog

RAKSHABANDHAN

VIJAYA DASHMI